Satya Nadella : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పాత వీడియో ఒకటి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన అందులో ఎంఎస్ ఎక్సెల్ డెమో ఇస్తున్నారు. అప్పటికి ఆయన మైక్రోసాఫ్ట్లో చేరి ఏడాది అవుతుంది. అప్పుడు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ టెక్నికల్ మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆ వీడియోను చూసి చాలామంది ట్విట్టర్ యూజర్లు రియాక్ట్ అవుతున్నారు. నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాక నేను ఆ సంస్థ గురించి అక్కడా ఇక్కడా ఆరా తీయలేదు. నమ్మకంతో షేర్లు కొనుగోలు చేశాను అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. బ్రాండన్ అర్వనఘీ అనేటాయన ఈ వీడియోను ట్విట్టర్లో పెట్టాడు. ఈ రోజు నాదెళ్ల 1.8 లక్షల కోట్ల డాలర్ల విలువై కంపెనీకి సీఈఓ. అయితే.. 1993లో ఆయన ఎక్సెల్ డెమోలు ఇచ్చే ఒక మేనేజర్ అంటూ బ్రాండన్ చెప్పుకొచ్చాడు.
భారత సంతతకి చెందిన సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్లో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగిన ఆయన 30 సంవత్సరాల తర్వాత సీఈఓగా బాధ్యతలు చేప్పట్టారు. 2014లో కంపెనీ మూడో సీఈఓగా నాదేళ్ల మైక్రోసాఫ్ట్ పగ్గాలు అందుకున్నారు. బిల్గేట్స్, స్టీవ్ బాల్మెర్ తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్ బాస్ అయ్యారు.
Today, he’s the CEO of a $1.8 trillion company.
In 1993, he was just another middle manager doing Excel demos.
Satya Nadella worked at Microsoft for 22 years.
He climbed the ladder.
And is worth ~$700 million today.
There are many ways to win. pic.twitter.com/SBMhuT0Awz
— Brandon Arvanaghi 🐱 (@arvanaghi) December 22, 2022