ఒలింపిక్స్ సంగ్రామం ముగిసింది. క్లోజింగ్ సెరమనీ కూడా అయిపోయింది. అథ్లెట్స్ అందరూ తమ దేశాలకు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈనేపథ్యంలో.. ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వైరల్ అవ్వడం మాత్రమే కాదు.. నెటిజన్ల ప్రశంసలను కూడా అందుకుంటోంది. అది ఒక జపానీస్ గురించి. జపాన్ కు చెందిన ఓ వ్యక్తి.. ఒలింపిక్స్ స్టేడియం బయట ప్రతి రోజూ ఒక ప్లకార్డ్ పట్టుకొని నిలబడేవాడు.
ముందు ఆ వ్యక్తిని చూసి ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ.. సౌత్ ఆఫ్రికాకు చెందిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఎల్మా స్మిత్ ఆ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ప్రస్తుతం జపాన్ మొత్తం ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు.
ఆమె ఆ ఫోటోను షేర్ చేయడం మాత్రమే కాదు.. జపాన్ గురించి గొప్పగా ట్వీట్ చేసింది. ఇంత సీరియస్గా, బాధ్యతగా ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం ఏ దేశానికైనా సాధ్యం అవుతుందా? అతిథులను ఎంతో గౌరవంగా చూసుకోవడంతో పాటు.. వాళ్లకు అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి.. గొప్పగా ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం ఒక్క జపాన్కే సాధ్యం అయింది. అందుకే నాకు జపాన్ అంటే ఇష్టం.. అంటూ ఆమె ట్వీట్ చేసింది.
ఇంతకీ.. ఆ వ్యక్తి పట్టుకొని ఉన్న ప్లకార్డులో ఏం రాసి ఉందో తెలుసా? గుడ్ మార్నింగ్ అథ్లెట్స్. మీరు మెడల్ గెలవకున్నా ఏమాత్రం బాధపడకండి. ఇప్పటికీ మీరే బెస్ట్. మిమ్మల్ని మీరు నమ్మకోండి.. అంటూ దాని మీద రాసి ఉండటంతో.. అక్కడి నుంచి వెళ్లే ప్రతి అథ్లెట్ దాన్ని చదవి.. ఒకవేళ తనకు మెడల్ రాకున్నా కూడా నిరుత్సాహపడకుండా.. తనకు తాను దైర్యం తెచ్చుకుంటారు. జపనీస్ వ్యక్తి.. ఒలింపిక్ క్రీడాకారులకు భలేగా ధైర్యాన్ని నూరిపోశాడు కదా. అందుకే.. ఆ ఫోటోకు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా లైకులు, షేర్లు వస్తున్నాయి. నువ్వు సూపరహె.. అంటూ నెటిజన్లు ఆ వ్యక్తి తెగ పొగిడేస్తున్నారు.