మనం టీ తాగాలంటే ఏదైనా దగ్గర్లోని హోటల్కు వెళ్తాం..మంచి చాయ్ తాగాలంటే ఓ రెండు లేదా మూడు కిలోమీటర్లయినా వెళ్లి తాగొస్తాం. కానీ వీళ్లు వెరీవెరీ స్పెషల్.. సముద్రమట్టానికి 21,312 అడుగుల ఎత్తుకెళ్లి టీ తాగారు. మౌంట్ ఎవరెస్ట్పై తేనీరు సేవించి గిన్నిస్లో చోటుసంపాదించారు.
అథ్లెట్, పర్వతారోహకుడు అయిన ఆండ్రూ హ్యూస్ తన సహచరులతో కలిసి ఈ అద్భుతమైన ఫీట్ను సాధించారు. కరోనా లాక్డౌన్ సమయంలో అతడికి ఈ ఆలోచన వచ్చిందట. ఆ సమయంలో ప్రకృతిని చాలా మిస్ అయ్యానని, లాక్డౌన్ తర్వాత తన సహచరులతో కలిసి ఏదైనా సాహసం చేయాలని నిర్ణయించుకున్నట్లు హ్యూస్ తెలిపాడు. గతేడాది ఈ ఫీట్ చేయగా, తాజాగా గిన్నిస్లో చోటు లభించింది.