గ్రామాల్లో చాలామంది ఆవులు, బర్రెల మీద ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. అవి ఇచ్చే పాలు, ఆవి వ్యవసాయంలో చేసే పనితోనే వాళ్ల బతుకు. ఈ మధ్య ఆవులు, బర్రెల నుంచి వచ్చే పేడ, మూత్రానికి కూడా గిరాకీ పెరిగింది. అందుకే జయగురు అనే సివిల్ ఇంజనీర్ తన ఉద్యోగాన్ని వదిలేసి తన సొంతూరుకు వచ్చేసి తన కాళ్ల మీద తాను నిలబడ్డాడు. కేవలం 10 ఆవులతో ఇప్పుడు లక్షలు గడిస్తూ అక్కడ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
నాకు 9 టు 5 జాబ్ అంటే అస్సలు నచ్చదు. అందుకే.. కొన్ని రోజులు సివిల్ ఇంజినీర్ గా ఉద్యోగం చేశాక.. మా సొంతూరుకు వచ్చేశా. మా నాన్న దగ్గర ఉన్న 10 ఆవులతో డెయిరీ ప్రారంభించా. మెల్లగా డెయిరీని అభివృద్ధి చేశా. ఇప్పుడు 130 ఆవులు ఉన్నాయి. ఆవుల నుంచి వచ్చే ప్రతిదీ విలువైనదే. ఆవుల పేడను కూడా అమ్ముతాం. నెలకు 1000 బ్యాగుల ఆవు పేడను అమ్ముతాం. ఆవు మూత్రం, ఆవులను కడిగాక వచ్చే నీళ్లు.. ఇవన్నీ నేలకు ఎంతో బలాన్నిస్తాయి. చివరకు ఆవులు చనిపోయినా కూడా వాటి బాడీలను కొన్ని రోజుల పాటు స్టోర్ చేసి.. లిక్విడ్ ఫెర్టిలైజర్ గా పంటలకు ఉపయోగిస్తాం.. అని చెప్పాడు జయగురు.
రోజులు 750 లీటర్ల పాలను తన డెయిరీ నుంచి ఉత్పత్తి చేస్తున్నాడు. నెలకు 30 నుంచి 40 కిలోల నెయ్యిని ఉత్పత్తి చేస్తారు. ఆవుల నుంచి వచ్చే పాలు, పేడ, మూత్రం.. అన్నింటి మీద నెలకు 10 లక్షలకు వరకు సంపాదిస్తూ.. అక్కడి స్థానికులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జయగురు. ఇంతకీ జయగురుది ఎక్కడో తెలుసా? కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
పోటెత్తిన వరద : వంట పాత్రలో పెండ్లివేదికకు వచ్చిన వధూవరులు!
మీరు లొడలొడ వాగుతారా.. అతిగా మాట్లాడే వాళ్ల కోసమే ఈ యాప్స్
ఒకప్పుడు భిక్షాటన ఆ ఊళ్లో కులవృత్తి.. కానీ ఆ ఒక్క నిర్ణయంతో..
ఈ ఐదు రకాల వ్యక్తులను అస్సలు పెండ్లి చేసుకోవద్దు..!