దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ ధరలు సామాన్యుడిని అతలాకుతలం చేస్తున్నాయి. అనేక నగరాల్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటింది. దీంతో ప్రజలు అనేక రూపాల్లో తమ నిరసన తెలుపుతున్నారు. 2021 ప్రారంభంలో పెట్రోల్ ధర రూ. 100కు చేరుకోగానే ఓ వ్యక్తి క్రికెట్ బ్యాట్, హెల్మెట్తో వచ్చి సెంచరీ కొట్టినట్లు సింబాలిక్గా నిరసన తెలిపాడు. కాగా, మహారాష్ట్రలోని ఓ కాలేజీ ల్యాబ్ అసిస్టెంట్ వినూత్నంగా నిరసన తెలుపుతున్నాడు. తన బైక్ను పక్కనపడేసి, గుర్రంపై కాలేజీకి వెళ్తున్నాడు. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతున్నది.
ఔరంగాబాద్కు చెందిన షేక్ యూసుఫ్ లాక్డౌన్ సమయంలో *జిగర్* అనే గుర్రాన్ని కొన్నాడు. పెట్రోల్ రేట్లు పెరగడంతో దానిపైనే ఇప్పుడు కాలేజి వెళ్తున్నాడు. ఈ వీడియోను ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్లో పెట్టింది. రోజువారీ గుర్రపుస్వారీ వల్ల పెట్రోల్ కొనే బాధ తప్పిందని, తాను ఫిట్గా ఉండేందుకు గుర్రపు స్వారీ ఉపయోగపడుతోందని యూసుఫ్ అంటున్నాడు.