క్రికెట్ అభిమానులకు ధోనీ బ్యాటింగ్ అంటే ఎంత ఇష్టమో.. ఆయన హెయిర్ స్టైల్ అంటే కూడా యువతలో అంతే క్రేజ్. ఎప్పుడూ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్తో ఫ్యాన్స్ని మెస్మరైజ్ చేస్తుంటాడు మాహీ.. అలాంటి ధోనీ ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు నయా లుక్లో దర్శనమిచ్చాడు. గుండుతో బుద్ధ సన్యాసి అవతారంలో నైరాశ్యంలో మునిగి ఉన్న ధోనీ గెటప్ ను చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఇప్పటికే చెన్నై చేరుకున్న ధోనీ.. అక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం కూడా బౌలర్లను ఉతికారేస్తూ కనిపించాడు. ఈ సమయంలో బౌద్ధ సన్యాసి రూపంలో ఉన్న ధోనీ ఫొటోను స్టార్ స్పోర్ట్స్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఈ లుక్ గురించి ఏమనుకుంటున్నారో చెప్పాలని సూచించింది. దీనికి స్పందించిన నెటిజన్లు.. ఏదైనా యాడ్ షూటింగ్ కోసం ధోనీ ఇలా వేషం వేశాడని అభిప్రాయపడుతున్నారు. సన్యాసి అవతారంలో లేకపోయినా ధోనీ ఎప్పుడూ సౌమ్యుడిగానే ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ధోనీ కొత్త లుక్ ఇప్పుడు వైరల్గా మారింది.