సాంకేతిక విజ్ఞానం అందించేందుకు ఇంటర్నెట్లు
జిల్లాకు భూసార కేంద్రం మంజూరు
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి
సోన్, మాదాపూర్లో రైతు వేదికలు ప్రారంభం
సోన్ / నిర్మల్ టౌన్, మార్చి 21 : వ్యవసాయం గురించి ముఖ్యమంత్రికి తెలిసినంత ఎవరికీ తెలియదని, అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రైతుకు వెన్నుదన్నుగా ఉండేందుకు రూ.25వేల కోట్ల బడ్జెట్ను కేటాయించారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండలకేంద్రంతో పాటు మాదాపూర్ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతు వేదికలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యవసాయ క్లస్టర్లకు అధికారులను నియమించడం తో రైతులకు ఏఈవోలు అందుబాటులో ఉంటున్నారన్నారు. రైతు వేదికల ద్వారా సాంకేతిక విజ్ఞానం అందించేందుకు ఇంటర్నెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నిర్మల్ జిల్లాకు భూ సార పరీక్షా కేంద్రం మంజూరైందని పేర్కొన్నారు. త్వరలో కాళేశ్వరం నీటిని శ్రీరాంసాగర్కు తరలించబోతున్నట్లు స్పష్టం చేశా రు. అనంతరం రైతుబీమా పథకం కింద మంజూరైన రూ.5 లక్షల చెక్కులను లబ్ధిదారులకు అందించారు. అనంతరం మం డలంలోని సంగంపేట్ గ్రామంలో 16 డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు.
మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం మాది..
మహిళల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్ర భుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నా రు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర బడ్జెట్లో మహిళలకు రూ.3 వేల కోట్ల నిధులను కేటాయించడాన్ని హర్షిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి స్వయం సహాయక సం ఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. మంత్రి అల్లో ల ఇంద్రకరణ్రెడ్డితో పాటు జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, ము న్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మహిళా కౌన్సిలర్లు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నినాదాలు చేశారు.
కవులు, కళాకారులకు గుర్తింపు..
తెలంగాణ ప్రభుత్వంలోనే కవులు, కళాకారులకు గుర్తింపు వచ్చిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. ప్రముఖ కవి కారం శంకర్ ఆధ్వర్యంలో నిర్మల్ నుంచి నిజామాబాద్కు నిర్వహిస్తు న్న కవియాత్రను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారులు, రచయితలు సమాజాన్ని చైతన్యం చేయడంలో కీలకపాత్ర పోషించారని తెలిపా రు. అనంతరం స్థానిక బస్టాండ్లో అబుల్ కలాం సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ డివిజన్ ఫారెస్టు అధికారులు మంత్రికి పూలబొకేను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమాల్లో జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి, డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్రావు, రైతు బంధు సమితి జిల్లా కో -ఆర్డినేటర్ నల్లా వెంంకట్రామ్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నర్మద, మంజులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ కృష్ణప్రసాద్రెడ్డి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఏవో ప్రవీణ్కుమార్, తహసీల్దార్ ఆరీఫా సుల్తానా, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, టీఆర్ఎస్ సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, నాయకులు పాకాల రాంచందర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, నిర్మల్కు చెందిన కవులు, కళాకారులు కృష్ణంరాజు, తొడిశెట్టి పరమేశ్వర్, వెంకట్, దేవురావు, పత్తిశివప్రసాద్, ఐ.కృష్ణ, నాగారాజు, తిరుపతి, అంబటి నారాయణ, భీమేశ్, కల్యాణి, పుండలిక్రావు, శ్రీనివాస్, అరుణ, తదితరులు పాల్గొన్నారు.