పకృతి సిద్ధంగా ఏర్పడిన సుందర రమణీయ దృశ్యాలను చూసి తరించడమే ఎకో టూరిజం. తెలంగాణ ఎకో టూరిజంలో రమణీయమైన దృశ్యాలు కోకొల్లలుగా ఉన్నాయి. హైదరాబాద్-నాగార్జునసాగర్-శ్రీశైలం సర్క్యూట్లో ఎకో టూరిజం సర్క్యూట్ ఉంది. మహబూబ్నగర్ జిల్లా ఫరహాబాద్ వద్ద జంగిల్ రిసార్ట్ ఉంది. హైదరాబాద్-చిల్కూరు-మంజీరా టూర్ ప్యాకేజీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సుందరమైన ప్రదేశాల్లో వరంగల్ జిల్లా ఏటూరు-నాగారం ప్రాంతం, కిన్నెరసాని జంగిల్ లాడ్జెస్ (ఖమ్మం జిల్లా ఉమ్మడి), కవ్వాల్ జంగిల్ లాడ్జెస్ (ఆదిలాబాద్ జిల్లా), కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, నాగార్జునసాగర్ వనవిహార్, కొండలు, అరణ్యాలు, జల వనరులతోపాటు ప్రాజెక్టు టైగర్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం..
– ప్రపంచ పర్యాటక పటంలో చోటుసంపాదించుకున్న నాలుగు శతబ్దాల సుందర నగరం. మ్యూజియాలు, గొప్ప వ్యక్తుల నివాస గృహాలు, విద్యాలయాలు, అధ్యయన కేంద్రాలు, కళాధామాలు, కళాశ్రయాలు, వాస్తుకళ, పురావస్తు మ్యూజియాలు, నృత్యశాలలు మొదలైనవి ఉన్నాయి. ఇవి గత చరిత్రకు సాక్షీభూతాలుగా పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
– పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక పర్యాటకోత్సవాలు నిర్వహిస్తుననారు.
– అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతుంది.
– తెలంగాణ బౌద్ధ వారసత్వాన్ని ఇప్పటి తరానికి తెలియజేయడానికి బుద్ధ పూర్ణిమ నాడు లుంబిని ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. హుస్సేన్సాగర్ బుద్ధ విగ్రహం, నాగార్జునసాగర్ వద్ద ఒకేసారి ఈ ఉత్సవాలు జరుగుతాయి. దేశ, విదేశాల నుంచి వచ్చిన భిక్షువులు కూడా పాల్గొంటారు.
– శిల్పారామంలోని పల్లె వాతావరణంలో ఉత్సాహం కలిగించే వినోద కార్యక్రమాలతో, వివిధ ప్రదర్శనలు, ఉపన్యాసాలు, ఫిల్మ్ ప్రదర్శనలు, ఉత్సవాలు ఇక్కడ జరుగుతుంటాయి.
– తారామతి-బారాదరి కల్చరల్ విలేజ్ పురావస్తు శాఖ సహకారంతో బృహత్తర పథకం చేపట్టింది. అబ్దుల్లా కుతుబ్షా ఆస్థాన నర్తకీమణి (1626-72) తారామతి జ్ఞాపకంగా గోల్కొండ నవాబులు తారామతి మందిరాన్ని నిర్మించారు. గోల్కొండకు 24 కి.మీ దూరంలో ఇబ్రహీంబాగ్ వద్ద భారీ ప్రాజెక్టులో సాంస్కృతిక ప్రదర్శనల కోసం ఆడిటోరియం, ఆధునిక మ్యూజిక్ సిస్టం, సదస్సులకు విశాలమైన హాలు, సంప్రదాయ సంగీత, నృత్య సాహిత్యాల కోసం గ్రంథాలయం, ఇంటర్నేషనల్ కల్చరల్ రిసెర్చ్ సెంటర్లు ఉన్నాయి. గోల్కొండ మ్యూజిక్ ఫెస్టివల్, ప్రేమావతి డ్యాన్స్ ఫెస్టివల్, ఫోక్ డ్యాన్స్ అండ్ ఆర్ట్స్ మ్యూజిక్ ఫెస్టివల్తో పాటు అనేక సంగీత సదస్సులకు వేదిక ఇది.
తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా, వాటికి అద్దం పట్టేలా నమూనా కట్టడాల ప్రదర్శన, 125, 3 ఎకరాల విస్తీర్ణాల్లో ప్రదర్శనలశాలలు ఉన్నాయి.
హైదరాబాద్కు 70 కి.మీల దూరం జహీరాబాద్ రహదారిలో ఈ ప్రదర్శనశాల ఉంది. శాతవాహన ముందు కాలానికి చెందిన నాణేలు, మట్టిబొమ్మలు, రకరకాల రాళ్లతో చేసిన పూసలు, రంగురంగుల మట్టిపాత్రలు ఉన్నాయి. 1930లో నిజాంరాజు ఈ మ్యూజియాన్ని ఏర్పాటుచేశాడు.
ఇక్కడ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ అడుగు ఎత్తున 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ఉన్నాయి.
ఇది చారిత్రక ప్రదేశం. జఫరుద్దౌలా గోల్కొండ సుల్తానుల సుబేదారు. ఆయనే ఈ పట్టణాన్ని నిర్మించారు. రాతితో నిర్మించిన వీటికి లక్కమేడలు అని పేరు. పూర్వం జైనులబస. వీరభద్రకొండపై దిగంబర భైరవుని విగ్రహం ఉంది. ఈ కొండ జఫర్గఢ్కు తూర్పు దిశలో ఉంది. పడమర లక్ష్మీనరసింహస్వామి గుట్ట, రెండు కోటలు ఉన్నాయి. ఈ కోటల్లో బురుజులు ఉన్నాయి. ఈ కొండలో ఎన్నో రహస్య మార్గాలు ఉన్నాయి. ఇక్కడే అక్కాచెల్లెండ్ల కోనేరు ఉంది. దీన్ని వేల్పులకొండ అంటారు. ఇది పంచనారసింహ కేంద్రం, గండబేరుండ, సుప్రసన్న, ఉగ్ర, జ్వాలా లక్ష్మీనరసింహ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఏనుగు బొయ్యారం, గుర్రాల బొయ్యారం, భజంత్రి దర్వాజలు ఉన్నాయి.
రఘునాథపల్లి మండల కేంద్రానికి 6 కి.మీ. దూరంలో ఉంది. షాపురానికి వాయవ్వదిశలో చెరువులను ఆనుకుని శిలాయుగపు సమాధులు ఉన్నాయి. అక్కడ ఆరు అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం, వినాయక విగ్రహం ఉన్నాయి. సర్దార్ సర్వాయి పాపన్న ఖిలాషాపురాన్ని ప్రధానకేంద్రంగా చేసుకుని పరిపాలించాడు.
స్టేషన్ఘనపురం నుంచి 23 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ క్షీరగిరి హరిహరక్షేత్రం ఉంది. ఇది పాలేరు నది జన్మస్థానం. సోమేశ్వర, లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఇక్కడ అర్ధరాత్రి సమయంలో ఆలయ గుహల నుంచి ఓంకార ప్రణవనాదం వినిపిస్తుందని ప్రతీతి.
– తీరిక సమయంలో ప్రశాంతత కోసం దగ్గర/దూరంలో ఉన్న చెరువులు, డ్యామ్లు, హిల్స్టేషన్లు, పార్కులు, జలపాతాలు, చారిత్రాక స్థలాలు, కట్టడాలు, మ్యూజియాలను తిలకించడాన్నే లీజర్ టూరిజం అంటారు.
రామకృష్ణ చెరువు వెంకటాపురం, లక్నవరం చెరువు-గోవిందరావుపేట, వన్యప్రాణి సంరక్షణ కేంద్రం-ఏటూరునాగారం, సున్నపు గుహలు-మైలాపురం, పాండవ గుహలు-కొత్తపల్లి, బొగత జలపాతం-చీకుపల్లి, సమ్మక్కసారలమ్మ గద్దె-మేడారం, గణపేశ్వరస్వామి ఆలయం- కోటగుళ్లు, కాకతీయ-థర్మల్ విద్యుత్ కేంద్రం-భూపాపల్లి, ముక్తేశ్వర, కాళేశ్వరస్వామి ఆలయం-కాళేశ్వరం, హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయం-మల్లూరు, నరసింహస్వామి ఆలయం-బుస్సుపూర్ మొదలైనవి చూడదగ్గ ప్రదేశాలు సందర్శించవచ్చు.
వరంగల్కు 70 కి.మీల దూరంలో ప్రస్తుత వెంకటాపురం మండలంలోని పాలంపేట గ్రామంలో గణపతి దేవుని కాలంలో అతని సేనాని రేచర్ల రుద్రుడు 1213లో ఈ చెరువును నిర్మించాడు. దీన్ని నిజాం కాలంలో కొంత ఆధునీకరించారు. ఈ చెరువులో నీరు నిల్వ ఉండటం వల్ల ఈ ప్రాంతం పర్యాటక శోభతో విరాజిల్లుతుంది. సుమారు 184 చ.కి.మీల పరిసర ప్రాంతాల్లో పడిన వర్షపు నీరు ఇందులో వచ్చే విధంగా నిర్మాణం చేపట్టారు. దగ్గరలోని రాళ్లవాగు, మేడివాగుకు అడ్డంగా రెండు కొండల మధ్య జలాశయాన్ని నిర్మించారు.
ప్రకృతిసిద్ధంగా దట్టమైన అడవులను మధ్యన లక్నవరం ఉంది. సహజసిద్ధంగా ఉన్న ఈ సరస్సు యాత్రికులను పరవశింప చేస్తుంది. వరంగల్ జిల్లా కేంద్రానికి 80 కి.మీల దూరంలో ఈ చెరువు ఉంది. గోవిందరావుపేట మండలంలోని బస్సాపురం గ్రామపంచాయతీ పరిధిలోనిది. సహజసిద్ధ కొండల మధ్య మూడు ఇరుకు లోయల ప్రాంతాన్ని మూసివేయడం ద్వారా ఈ జలాశయం ఏర్పడింది. 1213లో కాకతీయ గణపతి దేవ చక్రవర్తి ఈ చెరువును నిర్మించాడు. ఈ చెరువుపై తాడుతో నిర్మించిన వంతెన చూపరులను ఆకట్టుకుంటుంది.
1190లో రేగొండ మండలం తిరుమలగిరికి దగ్గరలో రావులపల్లి పరిసర ప్రాంతాల్లో పాండవుల గుట్టల్లో రేఖా చిత్రాలు కనుగొన్నారు. ఈ ప్రాంతం వరంగల్ మహదేవ్పూర్ రహదారిపై వరంగల్కు 45 కి.మీల దూరంలో ఉంది. ఈ గుట్టల్లో ఎదురు పాండవులు, పంచ పాండవులు, కుంతి దేవి గుహల్లో ప్రాచీన శిలాయుగపు వర్ణచిత్రాలు ఉన్నాయి. ఎదురు పాండవులు అనే కొండ గుహల్లో జింకలు, తాబేలు, చేపలు, కప్ప, చిలుక, సీతాకోకచిలుక, ఎలుగుబంటి, పెద్ద పులి, నెమలి, బల్లి మొదలైన జంతువులు, మానవాకృతులు, రేఖా చిత్రాలు ఎరుపు వర్ణంలో ఉండటం విశేషం. కుంతిదేవి గుహలో ఎరుపు వర్ణంలో చేతి ముద్రలు గదాయుద్ధం చేస్తున్న పౌరులను శిలలపై చిత్రీకరించి ఉన్నాయి. ఇక్కడే రాష్ట్ర కూటుల శాసనం (9, 10 శతాబ్దం) చూడవచ్చు. ఈ గుహల్లో పాండవుల కథ చిత్రీకరించి ఉండటం వల్ల పాండవుల గుట్ట అని పేరొచ్చింది.
వరంగల్కు 80 కి.మీల దూరంలో 1953లో ఏర్పడింది. చిట్యాల-తాడ్వాయి బ్లాక్లో సుమారు 813 చ.కి.మీలో వైశాల్యం ఉంది. అత్యంత సంపన్నమైన వన్యమృగ సంపద ఉన్న సంరక్షణ కేంద్రం ఇది. ఈ వన్యమృగ కేంద్రంలో లేళ్లు, పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు, తెల్లతుమ్మ, చండ్ర, మారేడు మొదలైన 76 రకాల వృక్ష జాతులు, 80 రకాల పక్షిజాతులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని చూడటానికి అక్టోబర్-మే మధ్య కాలం అనువైంది.
వరంగల్కు 65 కి.మీ.ల దూరంలో పాలంపేట గ్రామంలో ఉంది. దీన్ని రుద్రేశ్వరాలయం అని కూడా అంటారు. శిల్పకళా నైపుణ్యంలో అద్వితీయమైంది. గణపతి దేవుని రేచర్ల రుద్రుడు 1213లో కట్టించాడు. రుద్రేశ్వర మహాలింగం హనుమకొండలోని వెయ్యిస్తంభాల గుడిలోని ఈశ్వర లింగమంత పెద్దది. ఈ గుడి స్తంభాలు సరిగమలు పలుకుతాయి. 7వ శతాబ్దం నాటి గులాబీరంగు ఇసుకరాతితో మలచిన చిత్రాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.
– వరంగల్లుకు 140 కి.మీ దూరంలో ఉంది. ఇది మంగపేట మండలంలో ఉంది. స్వామివారి నాభి నుంచి నిరంతరం జిగురు-తేమ కారుతూ ఉంటుంది. అక్కడ ఉన్న పర్వతం పైనుంచి నిరంతరం చింతామణి ధార పేరుతో సెలయేరు ప్రవహిస్తుంది. స్వామి శిలామూర్తిని ఎక్కడ ఒత్తినా సజీవ శరీరంలా మెత్తగా ఉంటుంది. కొండరాతితో తొలచిన గుహాలయంలో ఈ విగ్రహం ఉంది.
ఇందులో ఉద్యానవనాలు, అడవులు, సంరక్షణాలయాలు వస్తాయి. వింతవింత వన్యప్రాణులు, పక్షులను చూడటాన్ని వైల్డ్ లైఫ్ టూరిజం అంటారు. నదులు, పార్కులు, కొండలు, కోనలు, గుట్టలు, అడవులు ఎన్నో రకాల జంతువులు, పక్షులు ఈ టూరిజంలో చూడవచ్చు.
మంచిర్యాలకు 50, హైదరాబాద్కు 260 కి.మీల దూరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఈ ప్రాంతం ఉంది. విస్తీర్ణం 893 చ.కి.మీలు.
మంచిర్యాలకు 70, హైదరాబాద్ 300 కి.మీల దూరంలో ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. విస్తీర్ణం 136 చ.కి.మీలు. ఇక్కడ నీల్గాయ్ జంతువులు, బ్రాహ్మణి బాతుల వంటి పక్షులు ఇక్కడ ఉన్నాయి.
ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో 37 చ.కి.మీలో ఉన్న సంరక్షణాలయం. ఇది మంచిర్యాలకు 50, కరీంనగర్ జిల్లా మంథనికి 10 కి.మీలు. ఇక్కడ సాంబార్ జంతువు ప్రత్యేకత.
నిజాం నవాబు నిర్మించిన డాల్హౌస్ (1935) నేడు పురావస్తు ప్రదర్శనశాలగా మారింది. ఇందులో బుద్ధిస్ట్, న్యూమిస్మేటిక్స్, టెక్స్టైల్స్, చైనీస్వేర్, బిద్రీవేర్, సయ్యద్ అహ్మద్, జలాలుద్దీన్ చిత్రించిన అజంతా చిత్రాలు ఉన్నాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అబ్దుల్ రహమాన్ చుగ్లూయ్ వర్ణచిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పీటీ రెడ్డి, కాపు రాజయ్య, వై.బాలయ్య, కొండపల్లి శేషగిరిరావు, పీఆర్ రాజు, పైడిరాజు, కృష్ణమూర్తి, ఉల్చి, గిరి మొదలైనవారి వర్ణ చిత్రాలు ఉన్నాయి. 16వ శతాబ్దపు కొయ్యరథం, కళి మండపం, కుతుబ్షా, అసఫ్జాహీల యుద్ధ పరికరాలు చూడవచ్చు.
ఇక్కడ ఆదిమ మానవుని పనిముట్లు, చేతిగొడ్డలి, బ్లేడ్లు, ఒడిసెలరాళ్లు, ఇనుప యుగానికి చెందిన మట్టి శవ పేటికలు, రంగురంగుల మట్టిపాత్రలు ఉన్నాయి.
కుతుబ్షాహీ, అసఫ్జాహీల ట్రెజరీగా ఉండటం వల్ల ఖజానా బిల్డింగ్ చూడతగినది.
విలక్షణ ఇస్లాం వాస్తును ప్రదర్శిస్తున్న సమాధులను ఇక్కడ చూడవచ్చు. కత్తులు, కటార్లు, చైనా పింగాణి పాత్రలు మొదలైనవి ఈ మ్యూజియంలో ఉన్నాయి.
మూడో సాలార్జంగ్ దీనిని ఏర్పాటుచేశాడు. ప్రపంచంలోని కొన్ని అపురూప వస్తువులు ఇక్కడ ఉన్నాయి. దేశంలో మూడో జాతీయ ప్రదర్శనశాలలో ఇది ఒకటి. పాలరాతి శిల్పాలు, స్పటికం, గాజు వస్తువులు, ఐరోపా, జపాన్ పెయింటింగ్స్, రాజస్థానీ మినియేచర్ పెయింటింగ్స్ ఉన్నాయి.
ఫాజిల్స్, రాతియుగపు పనిముట్లు, పెద్దబంకూరు, ధూళికట్టల నుంచి సేకరించిన చారిత్రక యుగపు ఇటుకలు, మట్టిపాత్రలు, కాకతీయ రాగి రేకు శాసనాలు, బిద్రీ పాత్రలు, మినియేచర్ పెయింటింగ్స్, ధూళికట్ట బౌద్ధ శిలాఫలకాలు ఇక్కడ ఉన్నాయి.
మహబూబ్నగర్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మ్యూజియంలో శిల్పాలు, ఆలయం, శాఖోపశాఖలుగా విస్తరించిన మర్రిచెట్టు, అటవీ శాఖ నర్సరీ, పక్షుల సంరక్షణాలయం, అప్పటి పాత్రలు, ఆయుధ సామగ్రి, నాణేలు, వల్లీ సుబ్రహ్మణ్య, పార్శనాథ, మహవీర శిల్పాలు ఇక్కడ ఉన్నాయి.