హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సరూర్ నగర్ చెరువు ప్రక్కన ప్రియదర్శిని పార్క్ నందు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం నాడు బోటింగ్ సేవలను ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 గంటలకు పర్యాటక శాఖామాత్యులు వి. శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas Goud) బోటింగ్ను ప్రారంభించనున్నారు.
అదేవిధంగా 9 గంటల 45 నిమిషాలకు హయత్ నగర్లోని చారిత్రాత్మక “హయత్ బక్షి మజీద్”ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులు, మాజీ కార్పొరేటర్లు, పార్టీ అధ్యక్షులు, వివిధ డివిజన్ల నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమానికి హాజవరవ్వాలని స్థానిక ఎమ్మెల్యే, ఎంఆర్డీసీఎల్ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి కోరారు.