IRCTC Temple Run Tour | తమిళనాడు, కేరళలోని ప్రముఖ ఆలయాలను చూడాలనుకునే తెలంగాణ పర్యాటకులకు శుభవార్త. కన్యాకుమారి (Kanyakumari), రామేశ్వరం (Rameshwaram), మదురై (Madurai), తిరుచిరాపల్లి (Tiruchirapalli), తిరువనంతపురం (Thiruvananthapuram), పద్మనాభస్వామి ఆలయం తదితర ప్రాంతాలకు వెళ్లాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC Tourism) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’ (SOUTH INDIA TEMPLE RUN) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. విమాన మార్గంలో (Flight Route) ఈ టూర్ను ఆపరేట్ చేస్తున్నారు.
‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’ (SOUTH INDIA TEMPLE RUN) పేరుతో ఐఆర్సీటీసీ (IRCTC Tourism) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్ట్ 13వ తేదీన అందుబాటులో ఉంది.. . ఈ టూర్ ప్యాకేజీలో కన్యాకుమారి (Kanyakumari), రామేశ్వరం (Rameshwaram), మదురై (Madurai), తిరుచిరాపల్లి (Tiruchirapalli), తిరువనంతపురం (Thiruvananthapuram), పద్మనాభస్వామి ఆలయం లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 7 రోజులు 6 రాత్రులు కొనసాగుతుంది.
‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు హైదరాబాద్ (Hyderabad)లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.10 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు (RGIA)లో ఫ్లైట్ ఎక్కితే.. ఉదయం 6.50 గంటలకు తిరువనంతపురం (Thiruvananthapuram) చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం అల్పాహారం చేసి నేపియర్ మ్యూజియం (Napier Museum)ను సందర్శిస్తారు. మధ్యాహ్నం పూవార్ ద్వీపం (Poovar Island), సాయంత్రం అజిమల శివాలయం (Azhimala Shiva Temple) సందర్శన ఉంటుంది. అనంతరం రాత్రికి త్రివేండ్రంలో బస (Night Stay at Trivandrum) చేస్తారు.
Day 2 : రెండో రోజు తెల్లవారుజామున శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని (Padmanabhaswamy Temple) దర్శించుకుంటారు. అనంతరం కన్యాకుమారి (Kanyakumari) బయలుదేరాలి. దారిలో పద్మనాభపురం ప్యాలెస్ సందర్శన ఉంటుంది. సాయంత్రం సన్సెట్ పాయింట్లో సూర్యాస్తమయాన్ని వీక్షించొచ్చు. రాత్రికి కన్యాకుమారిలో బస ఉంటుంది.
Day 3: మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి రాక్ మెమోరియల్ (Rock Memorial) సందర్శన ఉంటుంది. ఆ తర్వాత రామేశ్వరం(Rameshwaram) బయలుదేరాలి. సాయంత్రం రామేశ్వరం చేరుకుంటారు. రాత్రికి రామేశ్వరంలో భోజనం, బస ఉంటుంది.
Day 4 : నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత రామేశ్వర ఆలయాన్ని (Rameshwaram Temple) సందర్శన ఉంటుంది. అనంతరం ధనుష్కోడి(Dhanushkodi)కి వెళ్లొచ్చు. (పర్యాటకులు సొంత ఖర్చులతోనే ధనుష్కోడికి వెళ్లాలి). రాత్రికి రామేశ్వరంలో భోజనం, బస ఉంటుంది.
Day 5 : ఐదో రోజు ఉదయం అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. తర్వాత అబ్దుల్ కలాం మెమోరియల్ (Abdul Kalam Memorial) సందర్శన ఉంటుంది. అనంతరం తంజావూరు (Tamjavuru)కు బయలుదేరుతారు. అక్కడ తంజావూరులోని బృహదీశ్వర ఆలయాన్ని (Brihadeeswara Temple) దర్శించుకున్న అనంతరం తిరుచిరాపల్లి (Tiruchirapalli)కి చేరుకుంటారు. రాత్రికి తిరుచిరాపల్లిలోనే భోజనం, బస ఉంటుంది.
Day 6 : ఆరో రోజు ఉదయం టిఫిన్ చేసిన అనంతరం శ్రీరంగం ఆలయాన్ని (Srirangam Temple) సందర్శిస్తారు. ఆ తర్వాత మదురై (Madurai)కి బయలుదేరాలి. సాయంత్రం మదురైకి చేరుకుని హోటల్ చెకిన్ ఉంటుంది. రాత్రికి మదురైలోనే బస చేయాలి.
Day 7 : ఏడో రోజు ఉదయం టిఫిన్ చేసిన అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. అక్కడనుంచి మదురైలో మీనాక్షి ఆలయాన్ని (Madurai Meenakshi Temple) దర్శించుకుంటారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 6.50 గంటలకు మధురై విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ ‘సౌత్ ఇండియా టెంపుల్ రన్’ ప్యాకేజీ ధర
Hyderabad to South India Temple Run cost | సౌత్ ఇండియా టెంపుల్ రన్ ప్యాకేజీ ధర చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.47000, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.34000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.32,250, చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి