Summer Vacation | సమ్మర్ హాలీ డేస్ అనగానే చాలామంది టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా హాలీ డే ట్రిప్ వేస్తుంటారు. ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంతానికి వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కొంతమందికి అయితే భారత్తో పాటు విదేశాల్లోని ప్రాంతాలను కూడా తిరిగి రావాలని కొంతమందికి కోరిక ఉంటుంది. కానీ విదేశాలకు వెళ్లాలంటే పాస్పోర్టు, వీసా కావాలి.. దీనికి చాలా తతంగం ఉంటుందనే ఆలోచనతో చాలామంది వెనక్కి తగ్గుతుంటారు. చూసిన ప్లేస్లు అయినా సరే మళ్లీ మళ్లీ వెళ్లొస్తుంటారు. కానీ వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా తిరిగి రావడానికి కొన్ని దేశాలు భారతీయులను ఆహ్వానిస్తున్నాయని తెలుసా! మన వాళ్లకు ఆయా దేశాలే ఈ వీసాలు, వీసా ఆన్ అరైవల్ ఏర్పాటు చేస్తున్నాయి. మరి ఆ దేశాలేంటో ఒకసారి చూద్దామా..
సమ్మర్ హాలీ డేస్లో రిలాక్సేషన్కు మాల్దీవులు చక్కటి ప్లేస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా హనీమూన్కు వెళ్లే కొత్త జంటలకు ఇది చాలా ఫేమస్. టూరిస్టులు చూసేందుకు, ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ చాలా ప్రదేశాలు ఉంటాయి. ఎన్నో అడ్వెంచరస్ గేమ్స్ కూడా ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే కాస్త ఖర్చయినా సరే చాలామంది మాల్దీవులను ప్రిఫర్ చేస్తుంటారు. అయితే మాల్దీవులకు వెళ్లాలంటే వీసా ఉండాలని చాలామంది అనుకుంటుంటారు. కానీ అక్కర్లేదు. భారతీయుల కోసం అక్కడి ప్రభుత్వం వీసా ఆన్ అరైవల్ సమకూరుస్తోంది. ఈ విధానం ప్రకారం ఎలాంటి ఛార్జీలు లేకుండానే వీసాలను పొందవచ్చు. 30 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితితో ఈ వీసా పొందవచ్చు.
వెకేషన్ అనగానే చాలామంది నోట వినిపించే పేరు థాయిలాండ్. కుర్రకారు నుంచి పెద్దవాళ్ల దాకా ఒక్కసారైనా బ్యాంకాక్ వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని అనుకుంటుంటారు. థాయిలాండ్లో ఒక్క బ్యాంకాక్ మాత్రమే కాదు.. క్రిబి, ఫుకెట్, ఫిఫి దీవులు కూడా పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. ఇక్కడికి హాలీ డే ట్రిప్ వెళ్లాలని అనుకుంటే ఎలాంటి వీసా అక్కర్లేదు. థాయిలాండ్ వెళ్లిన తర్వాత కేవలం 35 అమెరికన్ డాలర్లు చెల్లించి టూరిస్ట్ వీసా తీసుకోవచ్చు. ఈ వీసాతో 15 రోజుల పాటు థాయిలాండ్లోని అన్ని దీవులు తిరిగేసి రావొచ్చు.
అందమైన బీచ్లకు, నోరూరించే వంటకాలకు ఇండోనేసియా ఫేమస్ అని చెప్పొచ్చు. ఇక్కడి సముద్ర తీరంలో సేద తీరేందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడికి వెళ్లాలంటే కూడా ముందుగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండోనేసియా వెళ్లిన తర్వాత దాదాపు 30 అమెరికన్ డాలర్లు చెల్లించి టూరిస్ట్ వీసా పొందవచ్చు. దీని కాలపరిమితి రెండు నెలలు ఉంటుంది.
ప్రకృతి ప్రేమికులకు కాంబోడియా వీనుల విందును కలిగిస్తుంది. ఇక్కడ అడవులు, చెట్లతో పాటు పురాతన బౌద్ధ ఆలయాలు, కోటలు, బురుజులు విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడికి వెళ్లాలని అనుకుంటే ఆన్లైన్లో డబ్బులు చెల్లించి ఈ- వీసా పొందవచ్చు. లేదా కాంబోడియా వెళ్లిన తర్వాత 30 రోజుల గడువుతో వీసా తీసుకోవచ్చు.
భారత్కు దక్షిణ దిక్కున ఉన్న శ్రీలంక ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడి విభిన్న వృక్ష జాతులు, దట్టమైన అడవులు, బీచ్లు ఈ ప్రాంతానికి పేరు తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ పద్ధతిలో శ్రీలంకకు అనుమతిస్తారు. ఆన్లైన్లో దాదాపు 30 డాలర్లు చెల్లించడం ద్వారా ఈ వీసాను పొంది.. నెల రోజుల పాటు శ్రీలంకలో తిరిగి రావొచ్చు.
హిమాలయాలలో ఉన్న నేపాల్ ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడి లేక్ టేబుల్ ల్యాండ్ పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఈ దేశానికి వెళ్లాలంటే పాస్పోర్టు కూడా అవసరం లేదు. ఏదైనా గుర్తింపు పత్రం చూపిస్తే సరిపోతుంది. భారతీయులకు ఎలాంటి షరతులు విధించరు.
ఈ దేశం సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంది. కలుషితం కాని ప్రకృతి సౌందర్యాన్ని ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి కట్టు, బొట్టు అన్నీ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఇక్కడకు వెళ్లాలంటే వీసా అక్కర్లేదు. గడువు కూడా లేదు.
వాటర్ఫాల్స్, దట్టమైన అడవులు, బ్ల్యూ బే మెరీనా పార్క్, పీటర్ బోత్ కొండలు, నేచుర్ పార్క్ చూడదగిన ప్రదేశాలు. ఈ దేశంలో వీసా లేకుండా 90 రోజులు ఉండవచ్చు.
చారిత్రక ప్రదేశాలు, ఆలయాలు అంటే ఆసక్తి ఉన్నవాళ్లు వెళ్లేందుకు వియత్నాం చక్కటి ప్రదేశం. భారత్ నుంచి వచ్చే టూరిస్టుల కోసం ఇక్కడే తక్కువ ధరలో వీసాలను అందిస్తున్నారు. 30 రోజుల నుంచి 90 రోజుల వరకు బస చేసేందుకు వీలుగా ఇక్కడ వీసాలు పొందవచ్చు. దీనికోసం దాదాపు రూ.7800 చెల్లించాల్సి ఉంటుంది.
ఇవే కాదు ఇంకా చాలా దేశాలు వీసాలు లేకుండా భారతీయులను తమ దేశానికి ఆహ్వానిస్తున్నాయి. ఆయా దేశాలకు వెళ్లిన తర్వాత వీసాలు పొందే ఛాన్స్ ఇస్తున్నాయి. ఆ జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బ్యాంకాక్ అసలు పేరు ఏంటంటే.. ఆ పేరు మన శ్లోకాల కంటే పొడవైనది