ముంబై , మే11: బ్యాడ్ బ్యాంక్ అనేది ఓ రకమైన ఆర్థిక సంస్థ.బ్యాడ్ బ్యాంక్ల ఏర్పాటు ద్వారా రుణదాతల వద్ద పేరుకు పోయిన మొండి బకాయిలను తీసుకుని, వాటికి సరైన పరిష్కారం చూపాలని కేంద్రం నిర్ణయించింది.అందుకోసమే బ్యాడ్ బ్యాంక్ విధానాన్ని ప్రవేశ పెట్టింది.
ప్రభుత్వ,ప్రయివేటుబ్యాంకుల సహకారంతో ఈ బ్యాడ్ బ్యాంక్ వ్యవస్థ ఏర్పాటు అవుతుంది.మొండి బకాయిల పరిష్కారానికి చాలా మంది రుణదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.బ్యాడ్ బ్యాంక్ కార్యకలాపాలు ప్రారంభమైతే వందశాతం రుణాలను దానికి అప్పగించి రుణదాతలు పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంటుంది. 20వేల కోట్లమూలధనంతో బ్యాడ్ బ్యాంక్ల ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించింది.
బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుందంటే..?
రుణదాతలు గుర్తించిన నిరర్థక ఆస్తు (ఎన్పీఏ)లను ఎన్ఏఆర్సీఎల్ స్వాధీనం చేసుకుంటుంది. ఇందులోని లీడ్బ్యాంక్ స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఇతర ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీల నుంచి బిడ్లు ఆహ్వానిస్తుంది. ఎన్పీఏకు అధిక విలువ రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. రుణదాతలు శాతం కేటాయింపులు జరిపిన ఆస్తులను ఇందుకు ఎంచుకుంటుంది.2021-22 బడ్జెట్లో ప్రకటించిన బ్యాడ్ బ్యాంక్, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ (ఎన్ఏఆర్సీఎల్) కార్యకలాపాలు జూన్లో మొదలయ్యే అవకాశం ఉంది.