హైదరాబాద్, సెప్టెంబర్ 12, (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకంపై సోమవారం సీఎం కేసీఆర్ నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. పథకం అమలుకు పైలట్ ప్రాజెక్ట్గా రాష్ట్రంలోని నాలుగు ఎస్సీ నియోజకవర్గాలలోని నాలుగు మండలాలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం కూడా ఉన్నది. ఈ మేరకు భట్టి విక్రమార్కకు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. దీనిపై అంతర్గతంగా చర్చించుకున్న కాంగ్రెస్స పార్టీ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది.