హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారి ప్రజల జీవనశైలిలో అనేక మా ర్పులు తెచ్చింది. వైరస్ వ్యాప్తి కారణంగా ఇంట్లోనే ఎక్కువ సమయం గడపడంతో అధికశాతం మంది స్మార్ట్ఫోన్లకు బానిస అయ్యారు. భారత్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆన్లైన్లోనే గడుపుతున్నారు. నార్తన్ లైఫ్ లాక్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సైబర్ సేప్టీ సర్వేలో భారత్ నుంచి పాల్గొన్నవారిలో 66 శాతం మంది ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పని, చదువు కోసం కాకుండా రోజుకు అదనంగా 4.4 గంటలు ఆన్లైన్లో గడుపుతున్నామని 82 శాతం మంది అంగీకరించారు. ఇంట్లో ఉండేవారి ఆన్లైన్ ప్రవర్తనపై ఈ సర్వే నిర్వహించింది. భారత్ నుంచి వెయ్యి మందికిపైగా పాల్గొన్న సర్వేలో ప్రతి 10 మందిలో 8 మంది పని, చదువు కోసం కాకుండా ఇతర పనుల కోసం అదనంగా ఆన్లైన్లో ఉంటున్నామని తెలిపారు. ఈ కారణంగా శారీరక ఆరోగ్యం దెబ్బతిన్నదని 74 శాతం మంది, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిందని 55 శాతం మంది చెప్పారు. మొత్తంగా 76 శాతం మంది ఆన్లైన్లో ఉండే సమయాన్ని తగ్గించుకునేందుకు బయటికి వెళ్త్తున్నామని, స్నేహితులతో సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు