రవీంద్రభారతి, మే 30: ఇమ్యూన్ ఓరల్ డ్రాప్స్ కరోనా వైరస్ నియంత్రణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని శతాయుష్ ఆయుర్వేదిక్, ఎన్ఎఎస్డీ ఫార్మస్యూటికల్స్ ఎండీ విష్ణు, చీఫ్ ఫార్మసిస్ట్ శరత్ తెలిపారు. చంద్రదారు, అశ్వగంధ, యప్టిమధు, జీవంతి మొక్కల నుంచి సేకరించిన పదార్థాల ద్వారా ఔషధం తయారు చేయించినట్టు వివరించారు. మందును తెలుగు రాష్ర్టాల్లో ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రభుత్వం కొవిడ్ పేషెంట్లకు ఇచ్చే కిట్లో దీనిని చేర్చాలని కోరారు. మందులో కొవిడ్ నియంత్రణ లక్షణాలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించుకోవటానికి కేంద్ర వైద్యారోగ్యశాఖ పరిధిలోని క్లినికల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా (సీటీఆర్ఏ)లో నమోదు చేసుకున్నట్టు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సూపర్ స్పెషాలిటీస్ దవాఖానలో డాక్టర్ శైలజ వాణి బచ్చు నేతృత్వంలోట్రిపుల్ బ్లైండ్ పద్ధతిలో 50 మంది కరోనా పాజిటివ్ రోగులపై రెండు నెలలపాటు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్టు వివరించారు. అల్లోపతి చికిత్స తీసుకునే వారికి ఇమ్యూన్ ఓరల్ డ్రాప్స్ ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాప్తిని స్తంభింపచేసి మరింత మెరుగైన ఫలితాలనిచ్చేందుకు మార్గం సుగమం చేస్తుందని ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్ తెలిపారు. ఉచిత మందు కోసం కొవిడ్ బాధుతులు 8008002256 నంబర్లో సంప్రదించాలని కోరారు.