చండీగఢ్: చిమ్మ చీకట్లో 2-3 కిలోమీటర్ల దూరంలో ఓ రైలు వెళ్తున్నట్టు, అందులో లైట్లు వెలుగుతున్నట్టు ఊహించుకోండి. శుక్రవారం రాత్రి పంజాబ్లోని పఠాన్కోట్ వాసులకు ఇలాంటి దృశ్యమే కనిపించింది. కానీ ఆ దృశ్యం నేల మీద కాదు. అంతరిక్షంలో. శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో అంతరిక్షంలో వారికి రైలును పోలిన ఓ ఆకారం కనిపించింది. రైలు లాగే కదిలింది. ఐదు నిమిషాల తర్వాత అదృశ్యమైంది. ఇప్పుడిది ఓ మిస్టరీగా మారింది.