హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు, బీఏసీలో పాల్గొన్న అనంతరం సాయంత్రం ఢిల్లీకి వెళ్తారు. శనివారం కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో సమావేశమ వుతారు. 26న విజ్ఞాన్భవన్లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే తీవ్రవాద ప్రభావిత రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం సీఎం కేసీఆర్ హైదరాబాద్కు తిరిగి వస్తారు.