హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కుటుంబ రాజకీయాలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. తమ పార్టీలో బంధుప్రీతికి, కు టుంబ రాజకీయాలకు చోటులేదని గొప్పలు చెప్పుకొంటూనే బీజేపీ నేతలు తమ వారసులను ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిపించుకొనేందుకు తహతహలాడుతున్నారు. బీజేపీ అధికారంలో ఉన్న అన్ని రాష్ర్టాల్లోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో చాలామంది నేతల కుటుంబాల్లో మనిషికో పదవి అనుభవిస్తున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నేతలు టీఆర్ఎస్పై కుటుంబ పార్టీ అని విమర్శించటంపై ప్రజలు మండిపడుతున్నారు.
బీజేపీ కుటుంబ రాజకీయాల జాబితాను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ శనివారం విడుదల చేశా రు. టీఆర్ఎస్ది కుటుంబపాలన అనే నైతిక హ క్కు బీజేపీకి లేదని తేల్చిచెప్పారు. ఏడేండ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలను మోదీ సర్కారు కాపీ కొట్టిందని గుర్తుచేశారు. ఇప్పుడు దళితబంధునూ కాపీ కొట్టి కొత్త పథకాన్ని తేవాలని డిమాండ్చేశారు.