తిరువనంతపురం : కేరళలోని విజింజం తీరంలో శ్రీలంకకు చెందిన ఫిషింగ్ నౌకనుంచి ఇండియన్ కోస్ట్గార్డ్ భారీగా హెరాయిన్ను స్వాధీనం చేసుకుంది. 300 కిలోల హెరాయిన్, ఐదు ఏకే-47 రైఫిల్స్, వెయ్యి రౌండ్ల 9 ఎంఎం మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నౌకను విజంజం నౌకాశ్రయానికి తీసుకురాగా.. హెరాయిన్ 301 ప్యాకెట్లలోని ఓడలోని వాటర్ ట్యాంక్ లోపల దాచి ఉంచగా పట్టుకున్నట్లు పేర్కొంది. ఎన్సీబీ చెన్నై జోనల్ యూనిట్ పడవను అదుపులోకి తీసుకుంది. ఓడలో నుంచి అనేక కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో ఇరాన్లోని చాబహార్ పోర్ట్ నుంచి గుర్తు తెలియని ఓడ హెరాయిర్, ఆయుధాలను తీసుకువెళ్లి లక్షద్వీప్ సమీపంలోని సముద్ర జలాల్లో శ్రీలంక ఫిషింగ్ బోట్ రవిహన్సీకి అప్పగించిందని ఎన్సీబీ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా సిబ్బంది ఎల్వై నందనా, హెచ్కేజీబీ దస్ప్రియా, ఏహెచ్ఎస్ గుణశేఖర, ఎస్ఐ సేనారత్, టీ రణసింగ్, డి నిస్సంకాను అదుపులోకి తీసుకొని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు.. ఇప్పటి వరకు పాక్ ఆధారిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నెట్వర్క్కు ఇందులో ప్రమేయం ఉన్నట్లు గుర్తించాయి.