హెచ్ఐవీ పాజిటివ్, అవయవ మార్పిడి చేయించుకున్న వారు, క్యాన్సర్ థెరపీ తీసుకుంటున్న వారు హోంఐసోలేషన్లో ఉండటానికి అనుమతి లేదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిల్లో ఉండాల్సి వస్తే, వైద్యుల సూచనలు తప్పక పాటించాలి.
60 ఏండ్లు పైబడి.. హైపర్ టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వైద్యులు పూర్తిగా పరీక్షించిన తర్వాతనే హోం ఐసోలేషన్లో ఉండాలి.
కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన తర్వాత కనీసం 10 రోజులు తక్కువ కాకుండా హోం ఐసోలేషన్లో ఉండాలి. అది కూడా వరుసగా మూడు రోజులు జ్వరం, దగ్గు ఉండకూడదు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశంలో సెకండ్వేవ్ (కరోనా రెండో ఉద్ధృతి) కారణంగా రోగుల తాకిడి పెరిగింది. దవాఖానల్లో బెడ్ల కొరతతో ఎక్కువమంది స్వీయ నిర్బంధంలో ఉంటూ వైద్యులు సూచనలతో కరోనా నుంచి కోలుకుంటున్నారు. మధ్యస్థాయి/లక్షణాలు లేని వారికి సంబంధించి కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఇదివరకు జారీచేసిన మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేసి కొత్త మార్గదర్శకాలు గురువారం విడుదల చేసింది. రెవ్ుడెసివిర్ ఇంజక్షన్ను ఇంట్లో చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులు వాడకూడదని తేల్చిచెప్పింది.
కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ సవరించిన మార్గదర్శకాలు..