హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జైళ్లశాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందికి హెచ్డీఎఫ్సీ బ్యాంకు యాజమాన్యం జీరో బ్యాలెన్స్తో సేవింగ్ ఖాతాలను అందుబాటులోకి తెచ్చింది. శనివారం జరిగిన కార్యక్రమంలో జైళ్లశాఖ డీజీ జితేందర్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ జీతాల ఖాతాలను ఉపయోగించుకొనే సిబ్బందికి ఎలాంటి ప్రీమియం చెల్లించకుండానే ప్రమాద బీమా కింద రూ.70 లక్షలు వర్తిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో జైళ్లశాఖ ఐజీ రాజేశ్కుమార్, డీఐజీలు మురళీబాబు, డాక్టర్ డీ శ్రీనివాస్, హెచ్డీఎఫ్సీ అధికారులు పాల్గొన్నారు.