న్యూయార్క్: అమెరికాకు చెందిన ప్రొడక్ట్ ఇంజినీరింగ్ అండ్ సొల్యూషన్స్ కంపెనీ జాప్కామ్ గ్రూపు(ZapCom Group) హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని తెలిపారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన భేటీలో జాప్కామ్ వ్యవస్థాపకుడు, సీఈవో కిషోర్ పల్లమ్రెడ్డితో మంత్రి కేటీఆర్ చర్చించారు. ట్రావెల్, హాస్పిటాలిటీ, ఫిన్టెక్, రిటేల్ రంగాల్లో కీలకమైన ఏఐ, ఎన్ఎల్పీ ఉత్పత్తులను జాప్కామ్ కంపెనీ రూపొందించనున్నది.
అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జాప్కామ్ కంపెనీకి కేంద్రాలు ఉన్నాయి. కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడాతో పాటు సెంట్రల్ అమెరికా, ఇండియాలోనూ ఆ కంపెనీకి ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్న జాప్కామ్ కంపెనీ తొలుత 500 మందికి ఉద్యోగాలు కల్పించనున్నది. ఆ తర్వాత ఏడాదిలోగా మరో వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో తెలిపారు.
ZapCom Group to set up Center of Excellence in Hyderabad
ZapCom Group Inc, a US-based Product Engineering and Solutions company, has chosen Hyderabad as the location to establish a Center of Excellence (CoE) specializing in AI and NLP driven products for the Travel and… pic.twitter.com/nba6SN58US
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 19, 2023