యాదాద్రి భువనగిరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నగరి ఎమ్మెల్యే రోజా ఇవాళ యాదాద్రి వచ్చారు. ఈ సందర్భంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని రోజా దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యే రోజాను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. రోజా వెంట టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవీ, యాదాద్రి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఉన్నారు.