హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-2గా ఉన్న వై సునీల్యాదవ్ బెయిల్ పిటిషన్లో వాదనలను హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని పేరొంటూ సునీల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 16న కాణిపాకంలో తన సోదరుడి సంస్మరణ కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరారు.
బెయిల్ పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ సుమలత గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది నయన్కుమార్ వాదనలు వినిపించారు. కాగా, సునీల్కు బెయిల్ ఇవ్వొద్దంటూ వివేకా కూతురు, భార్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.