నాంపల్లి కోర్టులు, అగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి విదేశీ టూర్ అనుమతిపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు కుటుంబసమేతంగా ఇంగ్లండ్ వెళ్లేందుకు అనుమతివ్వాలని సీఎం జగన్, నెల రోజులపాటు విదేశీ టూర్కు అనుమతిని కోరుతూ ఎంపీ విజయసాయిరెడ్డి తరఫున దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి.
సీబీఐ పీపీ కౌంటర్ దాఖలు చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ టూర్కు అనుమతివ్వొద్దని, సాక్షులను వీరు ప్రభావితం చేసే అవకాశముందని పీపీ కోర్టుకు వివరించారు. వాదనలు విన్న సీబీఐ కోర్టు తీర్పును గురువారానికి వాయిదా వేసింది.