సైదాబాద్, జూలై 21: యూట్యూబ్ చానల్కు వ్యూస్ రావటం లేదని ఐ దంతస్థుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడో యువకుడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకొన్నది. తమిళనాడులోని తిరుచ్చికి చెందిన చంద్రశేఖరన్, శాంకరి దంపతులు పదేండ్ల క్రితం ఉద్యోగరీత్యా సైదాబాద్ క్రాంతినగర్ కాలనీలోని ఆదర్శ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. చంద్రశేఖరన్ దక్షిణమధ్యరైల్వేలోని సికింద్రాబాద్ ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తుండగా, శాంకరి డీఆర్డీవో ఏఎస్ఎల్లో సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. వీరికి చంద్రశేఖర్ డీనా (23) ఒక్కగానొక్క కుమారుడు. అతడు గాల్వియర్ ఐఐటీలో ఇంజినీరింగ్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. డీనా సొంతంగా ఒక యుట్యూబ్ చానల్ నడిపిస్తున్నాడు. అయితే, తాను అశించిన స్థాయిలో చానల్కు వ్యూయర్స్ పెరగటం లేదని మానసికంగా కుంగిపోయాడు. గురువారం ఉదయం సుమారు 5 గంటల సమయంలో అపార్టుమెంట్పైకి వెళ్లి చానల్ లైవ్లో ఉంటూనే భవనంపై నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావటంతో వాచ్మ్యాన్ అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే రక్తమడుగులో పడి ఉన్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.