Kadem Project | కడెం, జూలై 28: కడెం ప్రాజెక్టు.. ఇటీవల కురుస్తున్న వర్షాలకు భారీగా వరద పోటెత్తి సాధారణ నీటి మట్టాన్ని మించిపోయింది. గేట్లు మొరాయించి.. నీరు బయటకు వదిలే అవకాశం లేకపోవడంతో ప్రమాదంలో పడిం ది. ఈ విషయం తెలుసుకున్న కడెం యువకులు స్పందించారు. గేట్లపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తున్నా.. ప్రాణాలను లెక్కచేయకుండా.. మొరాయించిన గేట్లను ఎత్తి నీటి విడుదలకు కృషి చేశారు. వీరి సాహసానికి స్థానికులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సలాం కొడుతున్నారు.
గతేడాది ఎదురైన అనుభవాల నేపథ్యంలో కడెంను నేషనల్ హైడల్ ప్రాజెక్టుగా గుర్తించి.. స్కాడా ఆధ్వర్యంలో స్విచ్ నొక్కి గేట్లు తెరిచేలా ప్రణాళికలు రచించారు. యంత్రాలననూ తెప్పించారు. టెండర్ల ప్రక్రి య జాప్యంతో పనులు పూర్తి కాలేదు. 18 గేట్ల కు రెండింటికి కౌంటర్ వెయిటర్లు తెగిపోయా యి. ఒక దానిని తిరిగి ఏర్పాటు చేశారు. మరోదాని పనులు కొనసాగుతున్న సమయంలోనే భారీగా వరద వచ్చిం ది. గేట్లను తెరిచేందుకు ప్రయత్నించగా.. 11 గేట్లు ఓపెన్ అయ్యాయి. మిగిలిన 6 తెరుచుకోకపోవడంతో నీరు గేట్ల పైనుంచి బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న 30 నుంచి 40 మంది కడెం యువకులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడి 4 గేట్లను మ్యాన్యువల్గా తిప్పుతూ పూర్తిగా పైకి ఎత్తారు. దీంతో 15 గేట్ల ద్వారా 2.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. వారి సాహసోపేత సేవలను స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు అధికారులూ అభినందిస్తున్నారు.