వేములవాడ రూరల్, జనవరి 7: అయోధ్య శ్రీరాముని అక్షింతలు తమ కాలనీకి రాలేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్ట ణ పరిధిలోని ఎస్సీకాలనీ యువకులు ఆదివారం నిరసనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి బీజేపీ కౌన్సిలర్కు వ్యతిరేకంగా నినదించారు.
అయోధ్య శ్రీరాముని ప్రతిష్ఠాపన సందర్భంగా శనివారం కోనాయిపల్లిలో ఇంటింటికి అక్షింతలు పంపిణీ చేసినా.. తమ కాలనీకి రాలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ గడ్డమీది లావణ్యపై మండిపడ్డారు.రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపగా, అక్షింతలు పంపిణీ చేస్తామని కౌన్సిలర్ చెప్పడంతో సమస్య సద్దుమణిగింది.