భిక్కనూరు, డిసెంబర్ 19: డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని గొడవకు దిగిన ఓ యువకుడు సర్పంచ్పై దాడి చేశాడు. అంతేకాకుండా పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ను దహనం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వరనగర్కు చెందిన గంధం రంజిత్ తనకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని సర్పంచ్ జనగామ శ్రీనివాస్తో మంగళవారం గొడవకు దిగాడు.
ఈ విషయమై సర్పంచ్ను నానా దుర్భాషలాడాడు. రంజిత్ తల్లి పేరిట వారం రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని, ఈ విషయమై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటానని సర్పంచ్ చెప్తున్నా వినిపించుకోలేదు. కోపోద్రిక్తుడైన రంజిత్ పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్పై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సర్పంచ్ శ్రీనివాస్, వీడీసీ అధ్యక్షుడు బోనాల శ్రీనివాస్ ప్రభుత్వ ఆస్తులను దహనం చేయొద్దని వారించారు. అయినప్పటికీ రంజిత్ సర్పంచ్పై కూడా పెట్రోల్ పోశాడు. ఈ విషయమై సర్పంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. రంజిత్ పోలీసుల అదుపులో ఉన్నట్టు ఎస్సై సాయికుమార్ తెలిపారు.