నల్లగొండ: జిల్లాలోని కట్టంగూరు మండలంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గత ఐదు రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై తేలాడు. అయిటిపాములకు చెందిన రాజశేఖర్ (27) అనే యువకుడు గత నెల 31వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. కాగా, శనివారం ఉదయం రామచంద్రగూడెం శివారులో అతని మృదేహాన్ని పోలీసులు గుర్తించారు. తోటి స్నేహితుడే హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో రాజశేఖర్ను హతమార్చినట్టు సమాచారం. హత్య అనంతరం నిందితుడు మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.