సుల్తాన్బజార్(హైదరాబాద్), మార్చి 12 (నమస్తే తెలంగాణ): ఎల్బీ స్టేడియం వేదికగా స్టుమాగ్జ్ ఆధ్వర్యంలో ప్రోస్ట్ పేరిట 10 వేల మందితో తెలంగాణలో అతి పెద్ద యూత్ కార్నివాల్ను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి హెల్త్సిటీ డైరెక్టర్ డాక్టర్ ప్రీతిరెడ్డికి బెస్ట్ ఉమెన్ లీడర్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డును అందజేశారు. తెలంగాణ యువత తమ సృజనాత్మకత, ప్రతిభను ప్రదర్శించేందుకు బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ పోటీలు నిర్వహించామని స్టుమాగ్జ్ వ్యవస్థాపకుడు చరణ్ లక్కరాజు పేర్కొన్నారు. ఈ వేడుకలు తెలంగాణ యువతకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్లో లయోలా అకాడమీ, సెయింట్ మేరీస్, అనురాగ్ యూనివర్సిటీ, సెయింట్ జోసెఫ్ కళాశాలలతో నిర్వహించిన పోటీలు అద్భుతంగా కొనసాగాయి. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ బెస్ట్ ప్రదర్శకుడిగా సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలకు చెందిన జాన్ పీటర్ నిలిచారని నిర్వాహకులు తెలిపారు.