Insta Reels | ఇటీవల సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి వద్ద ఏదో ఒక సోషల్ మీడియా అకౌంట్ తప్పనిసరిగా ఉంటున్నది. ఒక్క వీడియో తీసి పోస్ట్ చేస్తే లైక్స్, వ్యూస్ కోసం సాహసాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ డిగ్రీ విద్యారి ఇన్స్టా రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగర పరిధిలోని సనత్నగర్లో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. శ్రీరామ్నగర్ రహ్మత్నగర్కు చెందిన మదర్సా విద్యార్థి సర్ఫరాజ్ (16) మరో ఇద్దరు యువకులతో కలిసి సనత్నగర్ రైల్వేట్రాక్పై ఇన్స్టా రీల్స్ చేస్తుండగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో సర్ఫరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలం నుంచి ఫోన్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. అయితే, ముగ్గురు స్నేహితులతో కలిసి ఇన్స్టా రీల్స్ చేసేందుకు వెళ్లారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.