వెల్దుర్తి, ఫిబ్రవరి 24: మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కి తీగల ను పట్టుకొని ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ ఘటన శుక్రవారం సాయం త్రం మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ శివారులో జరిగింది.
వెల్దుర్తి ఏఎస్సై వసురాం సిబ్బందితో కలిసి ఉప్పులింగాపూర్ శివారులో హల్దీవాగు ఒడ్డున వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా.. చిన్నశంకరంపేట మండలం ఎస్ కొండాపూర్కు చెందిన సాయిరాం (25) మద్యం తాగి ఏఎస్సై, పోలీస్ సిబ్బందితో అసభ్యంగా మాట్లాడాడు. కొద్ది దూరం వెళ్లిన సాయిరాం.. విద్యుత్తు స్తంభం ఎక్కి తీగలను పట్టుకోగా షాక్ తగిలి చనిపోయాడు.