హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎంపీసీ చదివినా డాక్టర్ కావొచ్చు.. ఆశ్చర్యంగా అనిపించినా నేషనల్ మెడికల్ క మిషన్ (ఎన్ఎంసీ) నిర్ణయం మేరకు ఇది సాకారం కానున్నది. ఇంటర్లో ఎంపీసీ తీసుకొన్నామని.. మెడిసిన్ చదివి డాక్టర్ అయితే బాగుండు అని చాలామంది బాధపడుతుంటారు. ఇలాంటి విద్యార్థులకు ఎన్ఎంసీ తీపికబురు అందించింది.
ఎంపీసీ చదివినా నీట్ యూజీ పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చింది. గతంలో ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివినవారికే నీట్ రాసే అవకాశం ఉండే ది. తర్వాత, బయోటెక్నాలజీ చదివిన వారికీ అవకాశం కల్పించారు. తాజాగా మ్యాథ్స్ చదివిన విద్యార్థులకూ అనుమతి ఇచ్చింది. అయి తే, వారు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని, ఏదేని గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ లేదా బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకొని, ఉత్తీర్ణులు కావాలని నిబంధన విధించింది. వీరు ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు చేసేందుకు అర్హులని స్పష్టంచేసింది. వచ్చే నీట్ యూజీ నోటిఫికేషన్ నుంచే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం.