హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో తొలిసారిగా పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సును ప్రవేశపెట్టనున్నారు. వచ్చే విద్యాసంవవత్సరం నుంచి ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. యోగా సహా 19 రకాల కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. త్వరలోనే అకాడమిక్ సెనెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు పేర్కొన్నారు.
పీజీ డిప్లొమా ఇన్ యోగా, ఎంఎల్ఐసీ, బీఎల్ఐసీ, పీజీ డిప్లొమా ఇన్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్కింగ్, సర్టిఫికెట్ ఇన్ మెయింటెనెన్స్ ఆఫ్ డిజిటల్ లైబ్రరీ, ప్రొడక్ట్ డిజైన్, విజువల్ కమ్యూనికేషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, పీజీ డిప్లొమా ఇన్ కూచిపూడి, పీజీ డిప్లొమా ఇన్ యక్షగానం, పీజీ డిప్లొమా ఇన్ ఆంధ్రనాట్యం, పీజీ డిప్లొమా ఇన్ నవజనార్దనం, పీజీ డిప్లొమా ఇన్ కథక్, పీజీ డిప్లొమా ఇన్ భరతనాట్యం, పీజీ డిప్లొమా ఇన్ డిజిటల్ జర్నలిజం, పీజీ డిప్లొమా ఇన్ టెలివిజన్ ప్రొడక్షన్, పీజీ డిప్లొమా ఇన్ నాన్లీనర్ ఎడిషన్, పీజీ డిప్లొమా ఇన్ ఎపిగ్రఫీ, పీజీ డిప్లొమా ఇన్ పాలి అండ్ బుద్దిస్ట్ స్టడీస్.