మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేటలో శనివారం అరుదైన పసుపు రంగు పాము కనిపించింది. ఇంట్లో పామును గమనించిన కుటుంబీకులు లక్షెట్టిపేటకు చెందిన పాములు పట్టే అబ్బూషేక్కు సమాచారం ఇచ్చారు. ఆయన దానిని పట్టుకున్నాడు. జెర్రిపోతుజాతికి చెందిన ఇలాంటి పాములు అమెజాన్నదీ పరీవాహక ప్రాంతాల్లో కనిపిస్తాయని ఎఫ్ఆర్వో నగావత్ స్వామి తెలిపారు. -లక్షెట్టిపేట రూరల్