Yellow alert | హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది.
మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 9 నుంచి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది. ద్రోణి, వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలలోపు నమోదవుతున్నాయని తెలిపింది.