హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రజలకు వైసీపీ క్షమాపణ చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఏపీలో అభివృద్ధిపై తెలంగాణ మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మితిమీరి స్పందిస్తున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. హరీశ్రావుకు సమాధానం చెప్పకుండా తెలంగాణ ప్రజల ను ఆ పార్టీ నేతలు తిట్టడం సరికాదని సూచించారు. పాలకుల వ్యాఖ్యలను ప్రజలకు ఆపాదించకూడదని స్పష్టంచేశారు.
వైఎస్సార్ సీపీ నేతలందరికీ హైదరాబాద్లో వ్యాపారాలున్నాయని, అలాంటప్పుడు ఇక్క డి ప్రజలను ఎలా తిడతారని ప్రశ్నించారు. అదుపుతప్పి మాట్లాడే వారిని మందలించాల్సిన బాధ్యత సీఎం, మంత్రులపై ఉన్నదని జనసేనాని ఉద్ఘాటించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ వీడియో సందేశాన్ని జనసేన పార్టీ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసింది.