హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): చెన్నైలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూతురు అరెస్టు అయ్యారు. బిసెంట్ నగర్లో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్పాత్పైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో అక్కడ నిద్రిస్తున్న సూర్య అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విచారణ జరిపిన పోలీసులు మాధురిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమెకు బెయిల్ వచ్చినట్టు సమాచారం.