హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): ఊపిరితిత్తుల మార్పిడి, ఎక్మో, థోరియాసిక్ సర్జరీ సర్వీసులపై యశోద హాస్పిటల్స్, కోల్కతా మెడికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఆర్ఐ)-సీకే బిర్లా హాస్పిటల్స్ పరస్పర అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకొన్నాయి. మంగళవారం కోల్కతాలోని సీకే బిర్లా హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో యశోద అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్, లంగ్ ఫెయిల్యూర్ యూనిట్ కో-డైరెక్టర్ డాక్టర్ అపర్ జిందాల్, సీఎంఆర్ఐ సీకే బిర్లా హాస్పిటల్స్ డైరెక్టర్, పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజా ధార్ ఈ ఎంవోయూలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో సీకే బిర్లా హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ సిమ్మర్ దీప్సింగ్ గిల్, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, అడ్వాన్స్డ్ లంగ్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభమ్ శర్మ, సీఎంఆర్ఐ ఇంటర్వెన్షల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శ్యామ్ కృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.