వరంగల్ : యశోద హాస్పిటల్స్ నిర్వాహకులు మాతృభూమి రుణాన్ని తీర్చుకున్నారు. తల్లి పేరుతో మొదలుపెట్టిన యశోద హాస్పిటల్స్ గ్రూపు తెలుగు రాష్ర్టాల్లో ప్రముఖ వైద్య సేవల కేంద్రం గా నిలిచింది. ఈ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్రావు, గోరుకంటి సురేందర్రావు, గోరుకంటి దేవేందర్రావులు సొంతూరికి ఏదైనా చేయాలనే తపనతో ఒక్కొక్కటిగా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ఇందులో భాగంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లి – రాంపూర్లో యశోద చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యశోద సేవా కేంద్రాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ గ్రూప్ సంస్థ వ్యవస్థాపకులు గోరుకంటి రవీందర్ రావు, గోరుకంటి సురేందర్ రావు, గోరుకంటి దేవేందర్ రావులతో పాటు పలువురు పాల్గొన్నారు. రూ. 1.50 కోట్లతో యశోద సేవా కేంద్రాన్ని నిర్మించారు. మెగా ఫంక్షన్ హాల్-సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇందులో ఉన్నాయి. అందరూ వినియోగించుకునేలా వీటిని తీర్చిద్దారు.
ప్రధానంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉంటుంది. కంప్యూటర్ ట్రైనిం గ్ సెంటర్లో శిక్షణ పొందితే మెరుగైన ఉపాధి అవకాశాలు పొందేలా ఇక్కడ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలతోపాటు చుట్టుపకల గ్రామాల వారికి, అన్ని వర్గాల వారికి, నిరుద్యోగులకు, అనాథలకు, యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇక్క డ ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. మేడిపల్లి-రాంపూర్లో నిత్యం ప్రజలకు పూర్తిస్థాయిలో హెల్త్ క్యాంప్ నిర్వహించేందుకు కూడా ఫౌండేషన్ సన్నాహాలు చేస్తున్నది.