యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta)లో ఆదివారం భక్తులు పోటెత్తారు. శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. ఆదివారం ఒక్కరోజే ఆలయానికి రూ.54,84,992 ఆదాయం(Income) సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
ప్రధాన బుకింగ్ ద్వారా రూ.6,85,650, కైంకర్యముల ద్వారా రూ.1,700, సుప్రభాతం ద్వారా రూ.5,400,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 4,11,600, వ్రతాల ద్వారా రూ.3,56,800 ఆదాయం వచ్చిందని వివరించారు.వాహన పూజల(Vehicle Pooja) ద్వారా రూ.16,600, వీఐపీ దర్శనం ద్వారా రూ.5,25,000, ప్రచారశాఖ ద్వారా రూ.31,700,పాతగుట్ట ద్వారా రూ. 92,420,కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ. 6,50,000 వచ్చిందన్నారు.
యాదఋషి నిలయం ద్వారా రూ. 2,12,378, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ.1,70,464,శివాలయం ద్వారా రూ. 21,200,పుష్కరిణీ ద్వారా రూ.1,500, ప్రసాదవిక్రయం ద్వారా రూ. 20,67,200,శాశ్వత పూజల ద్వారా రూ.15,000, కళ్యాణ కట్ట ద్వారా రూ.1,82,500,అన్నదానం ద్వారా రూ.37,880 ఆలయానికి ఆదాయం సమకూరిందని తెలిపారు.