Telangana |యాదగిరిగుట్ట, మే18: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ప్రధానాలయం, అనుబంధ ఆలయాలైన పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు జనగామ జిల్లా బచ్చన్నపేట మండంల దుబ్బగుంటపల్లి యోగానందనరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి 22 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అనువంశికధర్మకర్త నరసింహమూర్తి,
ఈఓ భాస్కర్రావు శనివారం వెల్లడించారు. 20న స్వస్తివాచనం, 21న లక్ష పుష్పార్చన, 22న మూలమంత్ర హవనం, నృసింహ జయంతి, నృసింహ ఆవిర్భావం, మహానివేదన, తీర్థప్రసాద గోష్టి నిర్వహించి ఉత్సవాలు పరిపూర్ణం చేయనున్నట్లు చెప్పారు. ఉత్సవాల నేపథ్యంలో సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కల్యాణాలు, బ్రహ్మోత్సవాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.