యాదాద్రి ప్రధానార్చకులు నల్లంథీగల్
సీఎం కేసీఆర్కు జన్మదిన మంగళ శాసనములు
యాదాద్రి, ఫిబ్రవరి 16: ‘గతంలో బ్రాహ్మణులను ఏ ప్రభుత్వాలూ పట్టించుకోలేదు. దైవదర్శనానికి ఏదో వచ్చామా? దర్శించుకొన్నామా? అన్నట్టుగా ఉండేవాళ్లు. నాలుగు దశాబ్దాల అర్చకత్వంలో ఎన్నో వ్యథలు అనుభవించాం. సీఎం కేసీఆర్ సనాతన వేద సంప్రదాయాలను నమ్ముకొని జీవిస్తున్నారు. ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ప్రతి దేవాలయంలో నిత్య ధూపదీప నైవేద్యాలను ప్రవేశపెట్టి, బ్రాహ్మణోత్తములు, వైష్ణవోత్తములను ఆదుకొంటున్నారు’ అని యాదాద్రి ఆలయ ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనారసింహాచార్యులు తెలిపారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి శుభ మంగళశాసనములు అందించారు.