యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ దివ్య విమాన గోపురం స్వర్ణ తాపడానికి భక్తుల నుంచి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు..యాదాద్రీశుడి స్వర్ణ తాపడానకి మేము సైతం అంటూ తమ వంతు బాధ్యతగా విరాళాలు అందజేస్తున్నారు.
తాజాగా హైదరాబాద్లోని గుడి మల్కాపూర్ కార్వాన్ ప్రాంతానికి చెందిన బండారి బ్రదర్స్ రూ. 50 లక్షల విరాళం అందజేశారు.సోమవారం కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శించిన వారు శ్రీ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. అనంతరం ప్రముఖ వ్యాపార వేత్త బండారి శ్రీనివాస్.. ఆలయ ఈవో ఎన్ గీతను కలిసి విరాళం ను సంబంధించిన నగదును డీడీల రూపంలో అందజేశారు.