యాదాద్రి భువనగిరి, జనవరి 12 (నమస్తే తెలంగాణ): లారీ నేషనల్ పర్మిట్ రద్దు చేసేందుకు లంచం తీసుకుంటూ యాదాద్రి భువనగిరి రవాణాశాఖ అధికారి సురేందర్రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డారు. మరో ఇద్దరు ఏజెంట్లను శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. యాదాద్రి జిల్లా భూదాన్పోచంపల్లికి చెందిన ప్రవీణ్కుమార్ లారీ నేషనల్ పర్మిట్ రద్దు కోసం దరఖాస్తు చేసుకున్నారు. లంచం ఇస్తేనే పర్మిట్ క్యాన్సిల్ చేస్తానని డీటీవో సురేందర్రెడ్డి తెలిపాడు. గురువారం ప్రవీణ్కుమార్ రూ.5 వేలు తీసుకొని భువనగిరి జిల్లా రవాణా కార్యాలయానికి చేరుకున్నారు. ఆ డబ్బును ఆర్టీఏ ఏజెంట్లు సురేశ్, అనిల్కు అప్పగించాలని డీటీవో సూచించడంతో వారికి అందిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీటీవోతోపాటు ఇద్దరు ఏజెంట్లను అరెస్ట్ చేసి హైదరాబాద్ ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్కు తరలించారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఏ2 మల్లికార్జున్ పరారీలో ఉన్నాడు. కాగా హైదరాబాద్ హబ్సిగూడలో నివాసం ఉంటున్న సురేందర్రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు చేసినట్టు ఏసీబీ నల్లగొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.