యాదాద్రి భువనగిరి : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి డొంకెన రాజు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మహేందర్రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీపీ రవీందర్ నాయక్, పీఏసీఎస్ చైర్మన్ సింగిరెడ్డి నరసింహారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.