యాదాద్రి భువనగిరి : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ఓ గోషాలలో ఓ ఆవుకు లేగదూడ ఆదివారం జన్మించింది. లేగదూడ నుదుటగా తిరునామం ఆకారంలో ప్రత్యేక ఆకర్షణగా తెల్లని చారలు కనిపించడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దేవస్థానం ఈవో గీత లేగదూడను పరిశీలించి.. లేగదూడకు ‘నరసింహ’గా నామకరణం చేశారు. లేగదూడ నుదుట తిరునామం ఆకారంలో తెల్లని చారలుండడం అందరినీ ఆకట్టుకుంటున్నది.