హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడు వై సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని సీబీఐ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే కీలక సాక్ష్యాధారాలు తారుమారయ్యే ప్రమా దం ఉంటుందని తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్రెడ్డి, శివశంకర్రెడ్డితో వివేకాకు రాజకీయ వైరుధ్యం పెరిగిందని.. ఈ దశలో కడప ఎంపీ టికెట్ అవినాష్కు బదులుగా తనకు ఇవ్వాలని లేనిపక్షంలో వైఎస్ షర్మిల, విజయమ్మకు ఇవ్వాలని వివేకా కోరుకున్నారని తెలిపింది. ఇది అవినాష్ రెడ్డి, భాస్కర్రెడ్డికి నచ్చలేదని, శివశంకర్రెడ్డితో కలిసి వారు వివేకా హత్యకు కుట్ర పన్నినట్టు కనిపిస్తున్నదని వివరించింది.
హత్య జరిగిన రాత్రి వైఎస్ అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి ఇండ్లకు సునీల్యాదవ్ వెళ్లాడని తెలిపింది. వివేకా హత్య గురించి అవినాష్రెడ్డికి ముందే తెలుసునని పేర్కొంది. వివేకా హత్య గురించి అన్నీ తెలిసి కూడా పలు జాగ్రతలు తీసుకొని ఏ విషయమూ బయటకు పొక్కకుండా కుట్ర చేశారని చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజున నిందితుడు భాస్కర్రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని తెలిపింది. ఇంతటి కీలక కేసులో నిందితుడు సునీల్కు బెయిల్ మంజూ రు చేయవద్దని కోరింది. తదుపరి విచారణ ఈ నెల 27న జరుగనుంది.