మొయినాబాద్, డిసెంబర్ 16: విదేశాల్లో విద్యను అభ్యసించడం ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, దీనిపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ‘వై యాక్సిస్ సొల్యూషన్స్’ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు రెవె న్యూ డివిజన్ పరిధిలోని కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ దినపత్రికల ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ ఆన్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్పై వై యాక్సిస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. అధ్యాపకుల నుంచి కూడా మం చి స్పందన రావడంతో నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు ప్రజెంటేషన్ ఇచ్చి అవగాహన కల్పించారు.
విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకునే వారికి, విదేశాల్లో ఉద్యోగాలు పొందాలనుకునేవారికి, అక్కడ వ్యాపారాలు చేసే వారు ఎలా వీసాలు పొందాలి? అక్కడికి వెళ్లడానికి ఎలాంటి అనుమతులు కావాలనే అంశాలను వివరించారు. ఈ సందర్భంగా వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ మాట్లాడుతూ.. విదేశాల్లో విద్యను అభ్యసించడానికి అన్ని విధాలా సహాయం చేస్తామని తెలిపారు. కొన్ని బోగస్ కన్సల్టెన్సీలు ఉన్నాయని, వాటికి ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేదా ముందుగా తెలుసుకోవాలని సూచించారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ దినపత్రికలు ఇలాంటి మంచి కార్యక్రమానికి పూనుకున్నాయని కొనియాడారు. కెనడా, ఇతర దేశాల్లో విద్యను అభ్యసించే వారికి, ఉద్యోగాలు, వ్యాపారాలు చేయాలనుకునే వారికి వైయాక్సిస్ సంస్థ 1990 నుంచి సేవ లు అందిస్తున్నదని చెప్పారు. వీసాల కోసం ప్రతి నెలా ఎంతోమందికి వ్యక్తిగత కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో కేజీరెడ్డి కళాశాల డైరెక్టర్ రోహిత్ కందకట్ల, తెలంగాణ పబ్లికేషన్ మేనేజర్ టీ గణేశ్, ప్రతినిధి మహేశ్, అధ్యాపకులు, మూడు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన తప్పనిసరి
విదేశీ విద్యపై విద్యార్థులకు అవగాహన తప్పనిసరి. ఇలాంటి అవగాహన సదస్సులు వారికి ఎంతో దోహదపడతాయి. విదేశాల్లోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో విద్యను ఎలా అభ్యసించాలి? ఎలా వీసా పొందాలనే అంశంపై అవగాహన కల్పించిన తీరు ఎంతో బాగున్నది. ఇలాంటి సదస్సు నిర్వహణకు ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ముందుకు రావడం అభినందనీయం. వై యాక్సిస్ సొల్యూషన్స్ కన్సల్టెన్సీ చొరవ కూడా బాగున్నది. విద్యార్థుల తరపున నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు.
– డాక్టర్ విజయలత, కేజీరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, మొయినాబాద్
మోసపోకుండా జాగ్రత్తపడొచ్చు
విదేశాల్లో ఉద్యోగాలు చేయాలని అనుకున్న వారికి అవగాహన తప్పనిసరి. విదేశాలకు వెళ్లడానికి వీసా ఇప్పిస్తామని మోసం చేసే వారు చాలా మంది ఉన్నారు. ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లినప్పుడే విదేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. ఇంజినీరింగ్ విద్యార్థులు వర్తమానంలో సరిగ్గా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది. వై యాక్సిస్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే నిర్వహించిన సదస్సు మా విద్యార్థులకు చాలా ఉపయోగపడుతున్నది.
– డానియల్ ప్రభాకర్, డీన్ ప్లేస్మెంట్